ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా నివారణ చర్యల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

By

Published : Apr 2, 2020, 7:58 AM IST

కడప జిల్లా రాజంపేటలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రసాయన ద్రావణాలను పిచికారి చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్​నాథరెడ్డి రహదారుల వెంట రసాయన ద్రావణాలను చల్లారు.

chemical spry in rajampeta
రాజంపేటలో రసాయన ద్రావణాన్ని పిచికారి చేసిన మాజీ ఎమ్మెల్యే

రాజంపేటలో రసాయన ద్రావణాన్ని పిచికారి చేసిన మాజీ ఎమ్మెల్యే

కడప జిల్లా రాజంపేటలో కరోనా వైరస్ నియంత్రణ కోసం తన వంతు సాయంగా కాకతీయ విద్యాసంస్థల అధినేత పోలా శ్రీనివాసరెడ్డి 50 వేల రూపాయలను పురపాలక కమిషనర్ రాజశేఖర్​కు అందించారు. ఆ నగదుతో పట్టణంలో ప్రధాన రహదారుల్లో రసాయన ద్రావణాలను పిచికారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్​నాథరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం జగన్ ఇచ్చిన పిలుపు మేరకు కాకతీయ విద్యాసంస్థల అధినేత నగదు విరాళం ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే కరోనా వైరస్ నియంత్రణ కోసం పాటుపడుతున్న పోలీసులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి నిరంతర భోజన వసతి కల్పిస్తామని దాత శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ రాజశేఖర్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details