ఒంటరి మహిళలే లక్ష్యంగా బంగారు గొలుసుల చోరీకి పాల్పడుతున్న నలుగురిని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రాయచోటి, మైదుకూరు, కడప, రాజంపేట ప్రాంతాల్లో వీరిపై కేసులు నమోదైనట్టు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నిందితుల్లో శివకల్యాణ్రెడ్డి, షేక్ షామీర్తో పాటు ఇద్దరు మైనర్లు ఉన్నారని వివరించారు. వారి వద్ద 81 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు బైకులు, బ్యాటరీ స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలు.. నలుగురు అరెస్ట్
పద్దెనిమిదేళ్లు కూడా నిండని ఆ ఇద్దరు చోర కళలో సుప్రసిద్దులు. వీరు మరో ఇద్దరితో జత కట్టి.. ఒంటరిగా కనిపించిన మహిళల మెడలో బంగారాన్ని దొంగిలిస్తున్నారు. ఇలా కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటలా పాలయ్యారు.
Chain Snachers
Last Updated : Jun 25, 2021, 11:03 PM IST