కడప జిల్లా జమ్మలమడుగలో బాంబులు కలకలం రేపాయి. స్థానిక ముద్దనూరు రోడ్డులోని ఓ ప్రైవేటు స్థలంలో.. రియల్ ఎస్టేట్ వ్యాపారి భూమిని చదును చేస్తుండగా మొత్తం 14 బాంబులు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా ఈ నెల 8న ఇదే చోట హెలిపాడ్ ఏర్పాటు చేశారు. అటువంటి చోట బాంబులు బయటపడటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఒకచోట 13, మరోచోట ఒకటి చొప్పున మెుత్తం 14 బాంబులు బయటపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా.. ఆ పరిసర ప్రాంతాన్ని పూర్తిగా చదును చేసిన పోలీసులు.. మరో 40 బాంబులు బయటపడేసరికి విస్తుపోయారు. స్థానిక డీఎస్పీ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధ్యులు ఎవరైనా.. కఠిన చర్యలు తప్పవన్నారు.
జమ్మలమడుగులో బాంబులు.. 14 కాదు.. 54!!
ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటన సందర్భంగా జమ్మలమడుగులోని ఓ ప్రైవేటు స్థలంలో ఈ నెల 8న హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో ఇవాళ 54 బాంబులు బయటపడటం... కడప జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
bombs