ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జాతీయ సమస్యలకు ప్రధాని పరిష్కారం చూపారు'

ఏడాది పాలనలో ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రధాని మోదీ కోట్ల రూపాయలు ఖర్చు చేశారని.. భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న జాతీయ సమస్యలను పరిష్కరించారని ప్రశంసించారు.

By

Published : Jun 15, 2020, 6:56 PM IST

bjp state president bhanu prakash about pm modi
కరపత్రాలు పంచుతున్న భానుప్రకాశ్

ఏడాది పాలనలో ప్రధానమంత్రి మోదీ అనేక సంక్షేమ పథకాలను అమలు పరచారని... భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ అన్నారు. కడప జిల్లా రాజంపేటలో భాజపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రం విడుదల చేశారు. అనంతరం వాటిని గ్రామంలో పంచారు. ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోదీ ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించారన్నారు.

రాష్ట్రంలో పాలన గురించి మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ.. వారిని అరెస్ట్ చేయిస్తోందంటూ మండిపడ్డారు. ఏడాది పాలనలో 64 అంశాలపై హైకోర్టు అభ్యంతరాలు తెలిపిందంటే ప్రభుత్వ పాలన ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు.

ఇవీ చదవండి... జన జాగరణ్ అభియాన్ కార్యక్రమం చేపట్టిన భాజపా నేతలు

ABOUT THE AUTHOR

...view details