ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్యను దారుణంగా హతమార్చిన భర్త

భార్యను కిరాతకంగా చంపేశాడు ఓ భర్త. రోకలి బండతో ఆమె తలపై మోది ప్రాణం తీశాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో జరిగింది. నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

By

Published : Apr 17, 2020, 9:30 PM IST

a man killed his wife brutally in kadapa districtభార్యను తీవ్రంగా హింసించి... ఇంట్లోనే వదిలేసి!
a man killed his wife brutally in kadapa district

కట్టుకున్న భార్య పట్ల యముడిలా మారాడు భర్త. రోకలి బండతో భార్య తలపై మోది చంపేశాడు. కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన అంకాలమ్మ, పెద్ద గంగిరెడ్డి భార్యభర్తలు. వీరూ తరచూ గొడవ పడుతుండేవారు. ఆ కలహాలు తారా స్థాయికి చేరటంతో భార్య అంకాలమ్మ(53)ను పెద్ద గంగిరెడ్డి రోకలి బండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటి నుంచి పరారయ్యాడు. చివరకు గంగిరెడ్డి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని...త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పులివెందుల పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details