పశ్చిమగోదావరి జిల్లా కొండవీటి కడపకు చెందిన కొండవీటి నాగశివచంద్రరావు, ఊర్మిల దంపతుల కుమారుడు దుర్గా ప్రసాద్. ప్రస్తుతం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులు హోటల్ నిర్వహిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు డిప్లొమా పూర్తవగానే బెంగళూరులో కొంతకాలం ఉద్యోగం చేశాడు.
ఆ సమయంలో సూక్ష్మ చిత్రకళలో ప్రావీణ్యం సంపాదించాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతో పెన్సిల్ ముల్లుతో ఆకృతులు తయారుచేయడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు సుమారు 200లకుపైగా కళాఖండాలు తయారుచేశాడు. వాటిలో తాజ్ మహల్, చార్మినార్, బలిదాన్ తదితర చిత్రాలు ఉన్నాయి.