ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అంతర్వేది ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలి'

అంతర్వేది ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్​పర్సన్ వావిలాల సరళాదేవి డిమాండ్ చేశారు.

By

Published : Sep 7, 2020, 10:50 PM IST

Updated : Sep 8, 2020, 7:06 AM IST

vavilala-sarala-devi-demand-for-investigation-on-antarvedi-temple-fire-incident
'అంతర్వేది ఘటనపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలి'

రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధమైన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం కాలిపోయిన సంఘటనపై రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్​పర్సన్ వావిలాల సరళాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాట్లాడిన ఆమె... అంతర్వేది ఏకాదశికి జరిగే రథోత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారని చెప్పారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన దేవాలయంలో రథం కాలిపోవడం దారుణమన్నారు. దుష్ట శక్తుల చర్యలతో రథం కాలిపోయిందా? లేక మరేదైనా కారణం వల్ల జరిగిందా అనే విషయంపై ప్రభుత్వం ఒక కమిటీని నియమించి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

Last Updated : Sep 8, 2020, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details