ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 28, 2021, 5:28 PM IST

ETV Bharat / state

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఆటో: ముగ్గురికి గాయాలు

ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

raod accident
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఆటో.. ముగ్గురికి తీవ్ర గాయాలు

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం శివారులో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గంపేటకు చెందిన నలుగురు జీవనోపాధికి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్​కు ఆటోలో వెళ్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం సరిహద్దు వద్ద ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణ అనే వ్యక్తి ఎడమ కాలు విరిగిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details