ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని వెనక నుంచి ఢీకొన్న ప్రైవేటు బస్సు .. ఒకరు మృతి

లారీని వెనకనుంచి వచ్చి ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద ఈ తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

By

Published : Sep 17, 2020, 6:04 AM IST

road accident
road accident

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున లారీని వెనక నుంచి వచ్చి ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో సహాయక డ్రైవర్ మృతి చెందగా.. 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒడిశా నుంచి బెంగళూరుకు వలస కూలీలతో ఈ ప్రైవేటు బస్సు వెలుతుండగా ప్రమాదం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details