ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే ఆందోళన

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో ఎమ్మెల్యే మంతెన రామరాజు నిరసన చేశారు. డ్రైనేజీ శాఖ అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు.

By

Published : Sep 19, 2020, 7:23 AM IST

MLA concern against the attitude of the authorities in palakoderu west godavari district
అధికారుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే ఆందోళన

పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో డ్రైనేజీ శాఖ అధికారుల తీరుకు నిరసనగా... ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు 2 గంటల పాటు నిరసన చేశారు. మండలంలోని మోగల్లు, గుత్తులవారిపాలెం ప్రాంతాల్లో ముంపునకు గురైన వరి పంటను పరిశీలించడానికి వెళ్లారు. రైతుల సమస్యలను డ్రైనేజీ శాఖ అధికారులకు వివరిస్తుండగా... పూర్తిగా వినకుండానే వెళ్లిపోయారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును వ్యతిరేకిస్తూ వర్షంలో రెండు గంటల పాటు ఆందోళన చేశారు. మోగల్లు, గుత్తులవారిపాలెం ప్రాంతాల్లోని మురుగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు చెప్పడంతో నిరసన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details