ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అక్రమ నిర్మాణాలు కూలిస్తే... తెదేపాకు ఎందుకు బాధ'

నదీ తీరంలో నిర్మించిన అక్రమ కట్టడాలు కూలిస్తే... తెదేపా నేతలకు బాధ ఎందుకని మంత్రి తానేటి వనిత ప్రశ్నించారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి పర్యటించారు.

By

Published : Jun 28, 2019, 7:09 AM IST

మంత్రి తానేటి వనిత

ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా... ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉంటారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి... కృష్ణానది తీరాన అక్రమ నిర్మాణాలు తొలగిస్తే తెదేపా నేతలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. అక్రమంగా కట్టామనే విషయాన్ని ఎవరూ చెప్పడం లేదని విమర్శించారు.

మంత్రి తానేటి వనిత

ABOUT THE AUTHOR

...view details