పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన ఉక్కుసురి రాజేశ్వరరావు... కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ పై నుండి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేశ్వరరావు హైదరాబాద్లో కెమెరా అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి నందమూరు వచ్చిన రాజేశ్వరరావు... తన ద్విచక్రవాహనంపై... రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ వద్దకు వెళ్లాడు. వాహనం బ్రిడ్జ్రిపై పార్క్ చేసి... గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
రైల్వే వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో రోడ్ కం రైల్వే వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొవ్వూరు మండలం నందమురు గ్రామానికి చెందిన ఉక్కుసూరి రాజేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు.
కొవ్వూరులో రోడ్ కం రైల్వే వంతెన పై నుంచి గోదావరిలోకి దూకి వ్యక్తి గల్లంతు