ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. నలుగురికి గాయాలు

By

Published : Feb 1, 2021, 9:40 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద.. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్ కండక్టర్ సహా నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు.

lorry hits rtc bus
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో కండక్టర్ సహా నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలోని తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారిపై జరిగింది.

తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట నుంచి తణుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కండక్టర్ కొప్పుల కిషోర్​ సహా నలుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో జీలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.

ABOUT THE AUTHOR

...view details