ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 27, 2020, 7:44 PM IST

ETV Bharat / state

లారీ ఢీకొని ఒకరు మృతి

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం ముప్పవరంలోని ఓ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

lorry accidnet in west godavari dst one died
lorry accidnet in west godavari dst one died


పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం ముప్పవరంలోని నాగహనుమాన్ పరిశ్రమలో లారీ ఢీకొని బీహారుకు చెందిన చంద్రికా సహేని(45) మృతి చెందాడు. కొంతకాలంగా పరిశ్రమలో పనిచేస్తున్న ఇతను... లారీ లోడ్ చేయడానికి కన్నయ్య అనే వ్యక్తితో కలిసి గోదాం వద్దకు వెళ్లి లారీ రాకపోవడంతో అక్కడే పడుకున్నారు. లారీ వచ్చిన తర్వాత దాన్ని వెనక్కిపెట్టే క్రమంలో చంద్రిక సహేనిని ఢీకొంది. అతనిని వెంటనే భీమడోలు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ నుంచి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details