ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాగునీటి కోసం మహిళల ఆందోళన... పరిష్కరిస్తామన్న ఉన్నతాధికారి

By

Published : Oct 2, 2020, 5:06 PM IST

చాలా కాలంగా ఉన్న తాగునీరు సమస్యను పరిష్కరించాలంటూ.. దెందులూరు మండలం కొవ్వలి గ్రామ మహిళ ఆందోళన చేపట్టారు. ఈ మేరకు గ్రామ సచివాలయంలో బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

ladies protest for supply drinking water at kovvali village west godavari district
తాగునీటి కోసం మహిళల ఆందోళన... పరిష్కరిస్తామన్న ఉన్నతాధికారి

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి సచివాలయంలో నాలుగేళ్లుగా తాగునీరు రాక ఇబ్బంది పడుతున్నామని స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ.. మహిళలు బిందెలతో సచివాలయంలో ప్రవేశించి బైఠాయించారు.

స్థానిక బీసీ కాలనీకి చెందిన మహిళలు కొంత కాలంగా తాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. నాలుగేళ్లుగా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అధికారి వివరణ..

ఈ సమస్య ఇప్పటివరకు తన దృష్టికి రాలేదన్న ప్రత్యేక అధికారి... సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే తాగునీటికి ఇబ్బంది లేకుండా కృషి చేస్తామన్నారు.

ఇదీ చూడండి:

అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి

ABOUT THE AUTHOR

...view details