ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇన్ పుట్ సబ్సిడీ సబ్సిడీ రూ.31.7 9 కోట్లు మంజూరు

అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఇన్​పుట్​ సబ్సిడీని ప్రభుత్వం మంజూరు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో వరదల కారణంగా నష్టపోయిన రైతులకు 31. 79 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది.

By

Published : Nov 17, 2020, 1:36 PM IST

input subsidy for farmers
input subsidy for farmers

నీట మునిగిన పంట

పశ్చిమగోదావరి జిల్లాలో ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకు రైతులు నాలుగు పర్యాయాలు పంటలు నష్టపోయారు. జూలై నెల నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికే ఇన్​పుట్​ సబ్సిడీ విడుదల చేసింది. తాజాగా అక్టోబర్​లో కురిసిన వర్షాలకు జిల్లాలో ఎన్నో హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లింది. పంటలు నష్టపోయిన 45,331 మంది రైతులకు ప్రభుత్వం 31.79 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని జిల్లా అధికారులు తెలిపారు.

మంజూరైన ఇన్​పుట్​ సబ్సిడీ నగదును అర్హులైన రైతుల ఖాతాల్లో త్వరలోనే ప్రభుత్వం జమ చేస్తుందని అధికారులు వివరించారు.

ఇదీ చదవండి: వైఎస్​ఆర్ సున్నావడ్డీ పథకం నిధులు విడుదల.. రైతుల ఖాతాల్లో 510 కోట్లు

ABOUT THE AUTHOR

...view details