పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం రామానుజపురం(గొల్లగూడెం) గ్రామంలోని మసీదులో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మసీదు తాళాలు పగలగొట్టి లోపల ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే గుర్తించిన మత పెద్దలు... స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మసీదులో హుండీ మాయం చేసిన దుండగులు
ఓ మసీదులో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ప్రార్ధన ప్రాంగణం తాళాలు పగలకొట్టిన దుండగులు... ఏకంగా హుండీనే మాయం చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం రామానుజపురం గ్రామంలో జరిగింది.
మసీదులో హుండీని మాయం చేసిన దుండగులు