ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 21, 2020, 1:31 PM IST

ETV Bharat / state

'ధరలు పెంచితే మద్యం ఎందుకు మానేస్తారు?'

పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మాజీ మంత్రి పీతల సుజాత నిరసనకు దిగారు. అనాలోచిత నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ex minister pithala sujatha on current bills
విద్యుత్ ఛార్జీల పెంపునకు మాజీ మంత్రి పీతల సుజాత నిరసన దీక్ష

లాక్​డౌన్ కారణంగా పనుల్లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రభుత్వం కరెంటు బిల్లు పేరున హింసిస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో కరెంటు బిల్లుల పెంపునకు నిరసనగా దీక్ష చేపట్టారు.

మద్య నిషేధం పేరుతో అధిక ధరలు పెంచి పేదల కడుపు కొడుతున్నారన్నారని ఆరోపించారు. ధరలు పెంచితే మద్యం తాగటం ఎందుకు మానేస్తారని ప్రశ్నించారు. కష్టపడిన సొమ్మునంతా మద్యానికే ఖర్చుచేస్తున్నారనీ, ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details