ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేశం ఆశ్చర్యపోయే తీర్పు ఇవ్వాలి -సీఎం

'రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు అడుగుతున్నామనే కేసీఆర్.. మనపై దాడులకు పాల్పడుతున్నారు. ఆ దాడులకు జగన్​ సహకరిస్తున్నారు. విపక్షాలకు డిపాజిట్లు కూడా రాకూడదు. మీ ఓటుతో వారికి గుణపాఠం చెప్పాలి' - ఆచంట సభలో చంద్రబాబు

By

Published : Mar 23, 2019, 5:04 PM IST

Updated : Mar 23, 2019, 5:16 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట సభలో సీఎం

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట సభలో సీఎం
హైదరాబాద్​లో ఉన్న తన అక్రమాస్తులను కాపాడుకునేందుకే జగన్ కేసీఆర్​తో చేతులు కలిపారని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట సభలో సీఎం చంద్రబాబు విమర్శించారు. సీబీఐని మోదీ తన చేతిలో పెట్టుకుంటే..తెలంగాణలో ఉన్న ఆస్తుల కేసులను కేసీఆర్​ తన ఆధీనంలో ఉంచుకున్నారని ఆరోపించారు. ఏపీలో జగన్​ అధికారంలోకి వస్తే... కేసీఆర్ పెత్తనం చేయాలని చూస్తున్నారని అన్నారు.మోదీ, కేసీఆర్, జగన్​లు ముసుగులు తీసివస్తే వారి కథేంటో తేలుస్తామని ధ్వజమెత్తారు. వీరికి గుణపాఠం చెప్పాలంటే రాష్ట్రంలోని విపక్షాలకుడిపాజిట్లుకూడా దక్కకుండా చూడాలని ప్రజలకు సూచించారు. అందరూ ఐకమత్యంతో తెదేపాకు ఓటేసి దేశమంతా ఆశ్చర్యపోయేలా 175 అసెంబ్లీ స్థానాలు,.. 25 పార్లమెంట్ స్థానాల్లోగెలిపించాలని కోరారు. అప్పుడే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు.
Last Updated : Mar 23, 2019, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details