ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'సకాలంలో రేషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకొండి'

By

Published : Mar 4, 2021, 7:21 PM IST

ఇంటింటికి రేషన్​ ఇచ్చేందుకు వచ్చే వాహనాలు రాకపోవటంతో.. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో రేషన్​ అందకపోవటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

'సకాలంలో రేషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకొండి'
'సకాలంలో రేషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకొండి'

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని శిఖరాగ్ర గ్రామాలకు రేషన్ అందలేదు. నంద, దుగ్గేరు గ్రామంలో వాహనాల ద్వారా బియ్యం పంపిణీ జరగకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమ గ్రామ సమీపంలోనే రేషన్​ తీసుకునే వాళ్లం. ఇప్పుడు ఈ వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియదని వాపోయారు. సొంత వాహనాలు ఉండే వారు... సమీపంలోని గ్రామాలకు వెళ్లి రేషన్ తెచ్చుకుంటున్నారన్నారు. సమయానికి రేషన్​ అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. మంగళవారం సాయంత్రంతో గడువు ముగిసింది. అధికారులు స్పందించి తమకు రేషన్ అందించాలని కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details