ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 9, 2019, 1:05 PM IST

ETV Bharat / state

విజయనగరంలో వరలక్ష్మి వ్రతం పూజలతో ఆలయాల కిటకిట

శ్రావణ శుక్రవారం కావటంతో అమ్మవారి ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. మహిళలు పెద్దఎత్తున పాల్గొని కుంకుమార్చనలు నిర్వహించారు.

second friday of sravanam , vizayanagaram temples fulled with devotees

విజయనగరంలో అమ్మవార్లకు విశేష పూజలు..

విజయనగరంజిల్లాలో వరలక్ష్మీవ్రతం సందర్భంగా అమ్మవారి ఆలయాలు శోభాయమానంగా మారాయి. పైడితల్లి అమ్మవారు, సంతోషిమాత, అష్టలక్ష్మీ ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో విశిష్టతను సంతరించుకున్నాయి. ఆలయాల ప్రధాన ద్వారాలను రంగురంగుల గాజులతో అలంకరించారు. అష్టలక్ష్మీ ఆలయంలోని మూల విరాట్ ను రూ.10,రూ.20,రూ.50 రూపాయల నోట్లతో అలకంరించారు. ఉదయంనుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు హోరెత్తుతున్నాయి. భక్తులు పెద్దఎత్తున రావడంతో ఆలయాలు కళకళలాడుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details