విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కందిరివలసకు చెందిన గర్భిణి భారతికి.. పురుటి నొప్పులు అధికమైన కారణంగా.. కుటుంబీకులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి పిలిపించారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలోనే.. ప్రసవమైంది. భారతి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఆమెకు పురుడు పోసిన 108 సిబ్బంది.. తల్లీకుమారులను ఇద్దరినీ జాగ్రత్తగా పాచిపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇటీవలే.. మక్కువ మండలంలోని ఓ గర్భిణి సైతం.. ఇదే మాదిరిగా 108లో బిడ్డకు జన్మనిచ్చింది.