ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ రేషన్ బియ్యం అలాగే ఉంటుందా..?

By

Published : Jun 5, 2020, 1:57 PM IST

ప్రభుత్వం నిరు పేదలకు ఇస్తున్న పీడీఎస్ బియ్యం పక్కదోవ పడుతుంది. అయితే వీటిని అరికట్టేందుకు పోలీసుల ప్రయత్నం కొంత హర్షించదగ్గ విషయమే అయినా... కొంత నిరాశ వ్యక్తం అవుతోంది.

PDS Rice illegal transport
PDS Rice

భోగాపురం మండలం జాతీయ రహదారిపై గత 15 రోజుల కిందట పోలీసులకు చిక్కిన వాహనంలో సుమారు పది టన్నుల పీడీఎస్ బియ్యం లభించింది. చుట్టుప్రక్కల గ్రామాల్లో సేకరించి…. విజయనగరం తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడింది.

ఆ బియ్యం ఎండకు ఎండి, వానకు తడుస్తూ స్టేషన్ ఆవరణలో పడిగాపులు కాస్తుంది. ప్రభుత్వ పథకం కావడంతో అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు పంపిణీ చేస్తే ఎంతో బాగుంటుంది. ఈ విషయానికి సంబంధించి ఎస్ఐ మహేష్ ను వివరణ కోరగా… ఉన్నతాధికారుల ఆదేశాల కోసం చూస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details