ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం: మంత్రి బొత్స

కరోనా వైరస్ గురించి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధమవుతోందని చెప్పారు. లాక్ డౌన్​తో ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వారికి ప్రత్యేక షెల్టర్స్​ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

By

Published : Apr 7, 2020, 10:34 PM IST

minister bosta review on corona
minister bosta review on corona

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ

కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణపై విజయనగరం జిల్లా అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షించారు. కొవిడ్-19ని నియంత్రించేందుకు అధికారులు చేపట్టిన చర్యలపై చర్చించారు. జిల్లాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

కొవిడ్ 19ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని మంత్రి బొత్స తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగుకుండా ఉండేందుకు మార్కెట్లను వికేంద్రీకరణ చేశామని చెప్పారు. నిత్యావసర సరకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విపత్కర సమయంలోనూ కొందరు రాజకీయాలు చేస్తున్నారని... అలాంటి విధానం సరికాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details