ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జీవో నెం 3 రద్దుకు వ్యతిరేకంగా 'మన్యం బంద్​'

By

Published : Jun 10, 2020, 8:06 AM IST

జీవో నెం 3ని సుప్రీంకోర్టు రద్దు చేయడంపై.. మామిడిపల్లిలో మంగళవారం 'మన్యం బంద్​' నిర్వహించారు. గిరిజనులకు రక్షణగా ఉన్న జీవోను రద్దు చేయడం పట్ల గిరిజన సంఘం మండల కార్యదర్శి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో నూరు శాతం గిరిజనులకే ఇవ్వాలన్నారు.

manyam bandh done by tribal society people against supreme court decision in salurum mandal
విజయనగరం జిల్లా మామిడిపల్లిలో మన్యం బంద్​

గిరిజనులకు రక్షణగా ఉన్న జీవో నెం 3ని సుప్రీంకోర్టు రద్దు చేయడం సరికాదంటూ విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో మంగళవారం 'మన్యం బంద్​' చేశారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజనులకు రక్షణగా ఉన్న జీవో నెం 3ని రద్దు చేయడం సరికాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details