ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చోడవరం స్వయంభు ఆలయాల్లో దర్శనాలు

By

Published : Jun 8, 2020, 1:27 PM IST

Updated : Jun 8, 2020, 5:28 PM IST

విశాఖ జిల్లాలో రెండున్నర నెలల తర్వాత దేవాలయాలు తెరుచుకున్నాయి. ప్రతి ఆలయంలో శానిటైజర్ అందుబాటులో ఉంచి.. థర్మోస్కానింగ్ చేసి మరీ భక్తులకు ఆలయప్రవేశం కల్పించారు.

vishaka district
స్వయంభూ ఆలయాలలో దర్శినాలు

విశాఖ జిల్లా చోడవరంలోని రెండు స్వయంభు ఆలయాలైన గౌరీశ్వర, వినాయక ఆలయాలను ప్రాత:కాలాన్నే తెరిచారు. శానిటైజర్ ఏర్పాట్లు చేశారు. భక్తులను థర్మోస్కానింగ్ చేసి మరీ ఆలయప్రవేశం కల్పించారు. దేవాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారులు ట్రస్టు బోర్డు ప్రతిపాదిత ఛైర్మన్లు , సభ్యులు ఆయా ఆలయాల్లో ప్రథమ పూజలు చేశారు.

దర్శనానికి వచ్చే భక్తులు భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేశారు. రెండున్నర నెలల తర్వాత ఆలయాల ప్రవేశం కల్పించడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Jun 8, 2020, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details