ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్ ఎఫెక్ట్​.. తీరిన విశాఖ ప్రజల రోడ్డు సమస్య

విశాఖ జిల్లాలో రెండు నియోజకవర్గాల మధ్య సరైన మార్గం లేక ప్రజలు పడ్డుతున్న ఇబ్బందులను ఈనాడు, ఈటీవీ భారత్ లో పలుమార్లు కథనాలను ప్రసారం చేశారు. ఈ సమస్య పై అధికారులు స్పందించి సిమెంట్ రోడ్డు వేశారు. దీంతో ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Jan 19, 2021, 1:42 PM IST

road problem
ఈటీవీ భారత్ కథనంతో తీరిన విశాఖ ప్రజల రోడ్డు సమస్య

విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలు - చోడవరం ప్రధాన రోడ్డులో ఖండేపల్లి వద్ద రోడ్డు అభివృద్ధి చేశారు. ఈ రోడ్డులోని ఖండేపల్లి ఊరు సెంటరలో ఏమాత్రం వర్షం పడినా.. మెకాళ్లలోతులో నీరు నిలిచిపోయేది . దీంతో మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఈనాడు, ఈటీవీ భారత్ లో కథనాలను ప్రసారం అయ్యాయి. దీనిపై స్పందించిన అధికారులు ఖండేపల్లి వద్ద లోతట్టుగా ఉన్న ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు నిర్మించారు. దీంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తీరాయి.

ABOUT THE AUTHOR

...view details