ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'జీవీఎంసీ పరిధిలోని వార్డుల విభజన అస్తవ్యస్తంగా ఉంది'

జీవీఎంసీ పరిధిలోని వార్డుల విభజన అస్తవ్యస్తంగా ఉందని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పారదర్శక, అవినీతి లేని పాలనను అందించాలని చూస్తుంటే.. అధికారులు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

By

Published : Feb 11, 2020, 10:36 PM IST

Published : Feb 11, 2020, 10:36 PM IST

వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు
వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు

అధికారుల పనితీరుపై వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరభద్రరావు అసంతృప్తి

విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ పరిధిలోని వార్డుల విభజన అస్తవ్యస్తంగా ఉందని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ విభాగం అవినీతిలో కూరుకుపోయిందని దాడి ఆరోపించారు. సకాలంలో పనులు జరగటం లేదని... అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ పారదర్శక, అవినీతి లేని పాలనను అందించాలని చూస్తుంటే అధికారులు దానికి భిన్నంగా వ్యవహరించటం సరైంది కాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details