విశాఖలో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి బినామీలు భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. ఈ అంశంపై ప్రజల దృష్టి పడకుండా ఉండేందుకే వైకాపా నేతలు.. అశోక్ గజపతి రాజుపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, తెదేపా విశాఖ లోక్ సభ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. హర్షవర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సుభాష్, గోపినాధ్ రెడ్డి ...విశాఖలో విజయసాయి బినామీలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. సింహాచలం దేవస్ధానం ఈవో, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, విజిలెన్స్ ఎస్పీ, జీవీఎంసీ కమిషనర్లు వారికి సహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దసపల్లా భూములు, బేపార్క్ భూములను దోచుకునేందుకు విజయసాయి యత్నిస్తున్నారని ఆరోపించారు.
TDP: 'అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే అశోక్ పై విమర్శలు'
విశాఖలో ఎక్కడపడితే అక్కడ అక్రమాలకు ఎంపీ విజయసాయిరెడ్డి తెరతీస్తున్నారని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అశోక్ గజపతిరాజుపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, తెదేపా విశాఖ లోక్ సభ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.
మాట్లాడుతున్న తెదేపా నేతలు