ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్నకు స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన భక్తుడు

శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామి వారికి సబ్బవరం మండలానికి చెందిన భక్తుడు 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించాడు. ఆలయ ఈవో ఈ కానుకను అందుకుని దంపతులకు ప్రత్యేక దర్శనం కల్పించారు.

By

Published : Nov 21, 2019, 2:58 PM IST

అప్పన్నకు స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన భక్తుడు

సింహాద్రి అప్పన్న స్వామికి 50 స్వర్ణ తులసీ దళాలు సమర్పించాడు సబ్బవరం మండలానికి చెందిన భక్తుడు. తవ్వవానిపాలెంకు చెందిన మాజీ సర్పంచ్​ బోకం శ్రీనివాసరావు దంపతులు 25 లక్షల విలువైన 50 స్వర్ణ తులసీ దళాలను గురువారం శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామి వారికి కానుకగా అందించారు. గతంలోనూ అప్పన్నకు కాంస్య గరుఢ వాహనంతో పాటు పలు కానుకలను ఆలయానికి అందజేశారు. ఈ స్వర్ణ తులసీ దళాలను ఆలయ ఈవో వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి వారి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు.

అప్పన్నకు స్వర్ణ తులసీ దళాలు సమర్పించిన భక్తుడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details