ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అయోధ్యలో స్థల కోసం స్వాత్మానందేంద్ర దిల్లీ పర్యటన

దిల్లీ పర్యటనలో ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతీ... అయోధ్యలో ఆశ్రమ నిర్మాణానికి స్థల కేటాయించాలని కోరుతూ భాజపా నేతలకు లేఖ అందించారు. కుంభమేళాలో పీఠం చేపట్టబోయే సేవా కార్యక్రమాలకు సహకారం కోరారు. ఈ పర్యటనలో పలువురు ప్రముఖులు ఆయన్ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

By

Published : Dec 17, 2020, 8:02 AM IST

Published : Dec 17, 2020, 8:02 AM IST

swatmanandendra in delhi tour
swatmanandendra in delhi tour

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి దిల్లీలో పర్యటిస్తున్నారు. ముందుగా భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషిని కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో హైందవ ధర్మ పరిరక్షణకు పీఠం చేపడుతున్న కృషిని ఆయనకు వివరించారు. అయోధ్యలో విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమ నిర్మాణానికి అక్కడి ప్రభుత్వంతో చర్చించి స్థల కేటాయించాలని కోరుతూ మనోహర్ జోషీకిలేఖ అందించారు.

తరువాత కేంద్ర మంత్రి రాందాస్ బందు అతావలే నివాసానికి వెళ్లారు. విశాఖలో పీఠం చేపడుతున్న ధార్మిక కార్యకలాపాలను ఆయనకు వివరించారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును కలిసిన స్వామి స్వాత్మానందేంద్ర... కుంభమేళా గురించి చర్చించారు. హరిద్వార్ వేదికగా జనవరి నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాలో పీఠం చేపట్టబోయే సేవా కార్యక్రమాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర సహకారం అందేలా ప్రయత్నించాలని కోరుతూ లేఖ అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details