ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమోసా తయారీ కేంద్రాలపై విజిలెన్స్ దాడులు

అనకాపల్లిలో సమోసాలు తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

By

Published : Aug 31, 2019, 6:30 AM IST

అనకాపల్లి

సమోసా తయారీ కేంద్రాలపై విజిలెన్స్ దాడులు

విశాఖ జిల్లా అనకాపల్లిలోని లక్ష్మీదేవి పేట, వుడ్ పేటలో సమోసా తయారు చేస్తున్న రెండు సెంటర్లపై విజిలెన్స్ అధికారులు ఆహార కల్తీ నియంత్రణ అధికారితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సీఐ నారీమణి తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా అనకాపల్లిలో సమోసాలు తయారు చేసిన చోట నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని విజిలెన్స్ సీఐ.. నారీమణి పేర్కొన్నారు. ఆహార కల్తీ నియంత్రణ అధికారితో కలిసి తనిఖీలు నిర్వహించారు. తయారీలో ఉపయోగిస్తున్న ఉల్లిపాయ, బంగాళాదుంపలో నాణ్యత లేదన్నారు. వంట నూనె నాసిరకంగా ఉందన్నారు. వీటిని నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపుతామని.. నివేదిక వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి తయారీదారులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details