అకాల వర్షాల కారణంగా పంట నీట మునిగింది. విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని పలు ప్రాంతాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. ధాన్యం రంగు మారకుండా ఉండేందుకు బాధిత రైతులకు అధికారులు అవగాహన కలిగిస్తున్నారు. తడిచిన వరి పంటపై ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలని వ్యవసాయ అధికారి శ్రీనివాస్ సూచించారు. పది లీటర్ల నీటిలో 500 గ్రాముల ఉప్పు కలిపి స్ప్రే చేయాలని చెప్పారు.
'తడిసిన వరి ధాన్యంపై ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలి'
అకాల వర్షాల కారణంగా విశాఖ జిల్లా చీడికాడ మండలంలోని కొన్ని ప్రాంతాల్లో కోసిన వరి పంట నీట మునిగింది. దీంతో ధాన్యం పాడవకుండా ఉండేందుకు రైతులకు వ్యవసాయ అధికారులు పలు సూచనలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
Published : Nov 24, 2020, 12:21 PM IST
Published : Nov 24, 2020, 12:21 PM IST
|Updated : Nov 24, 2020, 9:47 PM IST
తడిసిన ధాన్యంపై ఉప్పు ద్రావణం పిచికారీ చేస్తున్న రైతు
Last Updated : Nov 24, 2020, 9:47 PM IST