ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహాచలంలో వైభవంగా నృసింహ జయంతి వేడుకలు

సింహాచలంలో నృసింహ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారిని స్వర్ణపుష్పాలతో అర్చించారు.

By

Published : May 17, 2019, 1:17 PM IST

అప్పన్న

సింహాచలంలో వైభవంగా నృసింహ జయంతి వేడుకలు

విశాఖలోని సింహాచల అప్పన్న సన్నిధిలో నృసింహ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్సవం సందర్భంగా భక్తులు సమర్పించిన స్వర్ణ పుష్పాలతో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారికి కి తొలి పూజ నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి స్వామివారి దర్శనాలు నిలిపివేస్తున్నారు. స్వామివారికి రెండో విడత చందన సమర్పణకు అరగదీసిన చందనంలో సుగంధ ద్రవ్యాలు కలిపి 125 కేజీల చందనం సిద్ధం చేశారు. రేపు స్వామికి చందన సమర్పణ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details