ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 10, 2021, 1:34 AM IST

ETV Bharat / state

'వైకాపా చేపట్టిన అభివృద్ధి పనులు పథకాలను చూసి ఓట్లేయండి'

ప్రభుత్వం చేపట్టిన పథకాలను చూసి పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థలను గెలిపించాలని మాకవరపాలెం మండలంలోని పలు గ్రామాల్లో నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా పథకాలకు అర్హులైన వారికి అందిస్తున్నామని.. తామ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

mla umashankar ganesh
ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్

వైకాపా చేపట్టిన అభివృద్ధి పనులను, ప్రవేశపెడుతున్న పథకాలను చూసి పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులను గెలిపించాలని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ ప్రజలను అభ్యర్థించారు. పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం గిడుతూరు, రాచపల్లి, గంగవరం ఇతర గ్రామాల్లో పర్యటించారు.

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా పథకాలను అర్హులైన వారికి అందిస్తున్నామని పేర్కొన్నారు. తాము చేపట్టిన అభివృద్ధిని చూసి తామ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ , మాకవరపాలెం మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details