ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మన్యం బందుకు జీవో సాధన సమితి పిలుపు

By

Published : Jun 8, 2020, 7:38 PM IST

జీవో 3 రద్దుకు నిరసనగా ఈ నెల 9న మన్యం బంద్​కు రాష్ట్ర జీవో 3 సాధన సమితి పిలుపునిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేసింది.

g.o sadana samihi called to manyam bandh programme 9 june
మన్యం బందుకు పిలుపునిచ్చిన జీవో సాధన సమితి

జీవో 3 సాధనే లక్ష్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ నెల 9 న మన్యం బందుకు రాష్ట్ర జీవో సాధన సమితి పిలుపునిచ్చింది. గత 40 రోజులుగా గిరిజన సంఘాలు ఇదే విషయంలో ఆందోళన చేస్తున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అప్పలనర్సయ్య అన్నారు. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా జీవోకుకు చట్టరూపం తేవాలని డిమాండ్ చేశారు. మన్యం బందుకు అందరూ సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details