జీవో 3 సాధనే లక్ష్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ నెల 9 న మన్యం బందుకు రాష్ట్ర జీవో సాధన సమితి పిలుపునిచ్చింది. గత 40 రోజులుగా గిరిజన సంఘాలు ఇదే విషయంలో ఆందోళన చేస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అప్పలనర్సయ్య అన్నారు. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా జీవోకుకు చట్టరూపం తేవాలని డిమాండ్ చేశారు. మన్యం బందుకు అందరూ సహకరించాలని కోరారు.