ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి పట్టివేత

విశాఖ మన్యం నుంచి ఉత్తర ప్రదేశ్ కు అక్రమంగా లారీలో తరలిస్తున్న 690 కిలోల గంజాయిని అనకాపల్లి టాస్క్ ఫోర్స్ బృందం స్వాధీనం చేసుకుంది. పట్టుబడిన సరుకు విలువ 60 లక్షలు ఉంటుందని అంచనా.

By

Published : Feb 7, 2019, 12:08 AM IST

విశాఖ జిల్లాలో

గంజాయి తరలిస్తున్న లారీ స్వాధీనం
ఒడిశాలోని చిత్రకొండ ప్రాంతంలో రవీంద్ర అనే వ్యక్తి నుంచి యూపీ లోని లక్నో కి చెందిన తివారీ అనే స్మగ్లర్ గంజాయిని కొనుగోలు చేశాడు. 5 కిలోల చొప్పున పొట్లాలుగా తయారు చేయించి లారీలో రహస్య అరలో అమర్చారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం పెద్దపీట సమీపంలో మాటు వేసి పట్టుకున్నారు. లారీని నర్సీపట్నం తీసుకొచ్చి నిందితులను ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details