విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్లో రాయగడ రైలు బ్రేకుల నుంచి పొగలు రావటంతో ప్రయాణికులు ఆందోళ చెందారు. విషయాన్ని స్టేషన్లోని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది బ్రేక్ నుంచి పొగలు వస్తునట్లు గుర్తించి సమస్యను పరిష్కరించారు. బ్రేకులు పట్టేయడం వల్ల ఇలాంటి సమస్య వస్తుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు భయపడాల్సిన పనిలేదని తెలిపారు. అధికారుల భరోసాతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
రైలు బ్రేకుల నుంచి పొగలు... ప్రయాణికుల ఆందోళన
రైలు బ్రేకుల నుంచి పొగలు వస్తే ప్రయాణికుల భయం మామూలుగా ఉండదు. ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రయాణికులను వెంటాడింది. విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వేస్టేషన్లోని ప్రయాణికుల పరిస్థితి ఇదే. చివరకు అధికారులు స్పందించటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Fumes from train brakes at anakapalli railway station in visakhapatnam