విశాఖ జిల్లాలో కురుస్తున్న పొగమంచు కారణంగా.. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇవాళ ఉదయం హైదరాబాద్, దిల్లీ నుంచి రావాల్సిన విమానాలు దారి మళ్లించారు. బెంగుళూరు విమానం మాత్రం ల్యాండ్ అయింది. మిగిలిన విమానాలు గంట నుంచి రెండు గంటలపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇబ్బందులకు గురైన వాహనదారులు
విశాఖ జిల్లా పెందుర్తిలో చలి గాలులు తీవ్రతతో.. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఉదయాన్నే పెందుర్తి, సింహాచలం, విశాఖ నగరం, గోపాలపట్నం సహా పలు ప్రాంతాల్లో మంచు కమ్ముకోవటంతో.. వాహనదారులకు ఇబ్బందులకు గురయ్యారు. నగరంలో మరో రెండు రోజుల పాటు ఇలాగే ఉంటుందని.. వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.
ఇదీ చదవండి:
Snow on Simhagiri : సింహగిరిని కప్పేసిన మంచు...ఆనందంలో భక్తులు...