కొవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలెవ్వరూ రోడ్ల మీదకు రాకుండా చూసుకునేలా నిత్యం రోడ్లు, వీధుల్లో పోలీసులు విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొంత మంది పోలీసులు అస్వస్థతకు గురవుతున్నారు. వారి బాధలను అర్థం చేసుకున్నవిశాఖ ట్రాఫిక్ సిబ్బంది.. ఎండ వేడి నుంచి రక్షణగా టోపీలు, చలువ కళ్లద్దాలను అందజేస్తున్నారు.
ఎండ నుంచి పోలీసులకు ఉపశమనాన్ని ఇస్తున్నారిలా..!
మనల్ని ఇంట్లో ఉండాలని చెప్పే పోలీసులు మాత్రం మండే ఎండల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా మనకోసం శ్రమిస్తున్నారు. వారికి కొంత ఉపశమనం ఇవ్వాలనుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. అందుకే ఇలా చేశారు.
Distributing caps to the police for protection of sun light in visakhapatnam