ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం: శైలజానాథ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... కేంద్రంలోని ఒక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శైలజానాథ్ విమర్శించారు.

By

Published : Aug 3, 2019, 6:57 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న శైలజానాథ్

సమావేశంలో మాట్లాడుతున్న శైలజానాథ్

కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శైలజానాథ్.. ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు. భాజపాతో సీఎం జగన్​మోహన్​రెడ్డికి పూర్తిస్థాయి అనుబంధముందని విశాఖలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆరోపించారు. త్రిపుల్ తలాక్, సమాచార హక్కు చట్టం వంటి చట్టాల ఆమోదం సమయంలో లోక్​సభలో వ్యతిరేకించిన.. వైకాపా ఎంపీలు రాజ్యసభలో ఓటు వేయకుండా బయటకు వెళ్లడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలోని 13 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details