ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శ్రద్ధ ఆసుపత్రి దోషి'.. త్రిసభ్య కమిటీ నివేదిక

విశాఖలో కిడ్నీ మార్పిడి ఉదంతంపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ..నివేదికను సిద్ధం చేసింది. ఐదు పేజీలతో కూడిన నివేదికను, 150 రికార్డులను కలెక్టరుకు అందజేసింది. ఈ వ్యవహారం అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని నివేదికలో పేర్కొంది.

By

Published : May 19, 2019, 1:30 AM IST

'శ్రద్ధ ఆసుపత్రి దోషి'.. త్రిసభ్య కమిటీ నివేదిక

విశాఖలో అక్రమంగా కిడ్నీ మార్పిడి జరిగిందన్న వ్యవహారంపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున నేతృత్వంలోని కమిటీ నివేదికను కలెక్టర్ కే. భాస్కర్​కు అందించింది. ఐదు పేజీలతో కూడిన నివేదికను, 150 రికార్డులను అందజేసింది. కిడ్నీ మార్పిడి కేసులో శ్రద్ధ ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా 29 మందికి శస్త్రచికిత్సలు చేసినట్లు నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో శ్రద్ధ ఆసుపత్రులను సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

మరోవైపు ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ విశాఖ పోలీసు కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా నిర్ణయం తీసుకున్నారు. విశాఖ వెస్ట్ ఏసీపీ దేవ ప్రసాద్​ను సిట్ అధికారిగా నియమించారు. అక్రమంగా అవయవ మార్పిడులకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం సమగ్ర విచారణ చేయనుంది.

'శ్రద్ధ ఆసుపత్రి దోషి'.. త్రిసభ్య కమిటీ నివేదిక

ABOUT THE AUTHOR

...view details