ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నదమ్ములు... మూడేళ్లలో అర్ధశతకానికి పైగా చోరీలు

తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. పుత్రులు ఇద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కానీ జల్సాలకు అలవాటు పడి గొలుసు దొంగతాలు చేయడం మొదలు పెట్టారు. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి చోరీలకు పాల్పడుతున్నారు. తప్పు అని మందలించాల్సిన వారి తల్లి కూడా దొంగతనాలను ప్రోత్సహించింది. చివరకు కటకటాలపాలయ్యారు.

By

Published : May 23, 2019, 5:09 AM IST

Updated : May 23, 2019, 5:40 AM IST

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగలు

వివరాలు వెల్లడిస్తున్న మహేశ్ చంద్ర లడ్డా

ఒంటరి మహిళలే లక్ష్యంగా విశాఖలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను, వారికి సహకరిస్తున్న తల్లిని ప్రత్యేక దర్యాప్తు బృందం పట్టుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్​ ఉద్యోగి కుమారులు చంద్ర శేఖర్ రెడ్డి, గోపినాథ్ రెడ్డి చెడు వ్యసనాలకు బానిసలై మహిళల మెడల్లో నగలు చోరీనే వృత్తిగా మరల్చుకున్నారు. జనసంచారం లేని ప్రాంతాల్లో ఒంటరి, వృద్ధ మహిళలే లక్ష్యంగా చేసుకుని నగలు దొంగిలించేవారు. మూడేళ్ల నుంచి వరుసగా 51 దొంగతనాల్లో 1382.90 గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. దొంగిలించిన బైకులపైనే పారిపోతుండేవారు. వారికి బుద్ధి చెప్పాలిసిన తల్లి కూడా ఈ దొంగతనాలను ప్రోత్సహించింది.

భారీగా బంగారం స్వాధీనం
దొంగతనాలను అరికట్టడానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం... నాలుగు నెలలు కష్టపడి ఇద్దరు నిందితులనూ, వారికి సహకరించిన తల్లిని అదుపులోకి తీసుకుంది. నిందితుల నుంచి రూ. 34.49 లక్షలు విలువైన 1142.50 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు వినియోగించిన ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా చెప్పారు.

Last Updated : May 23, 2019, 5:40 AM IST

ABOUT THE AUTHOR

...view details