విశాఖ మన్యం ముంచంగిపుట్టు మండలంలోని పోతురాజు పుట్టు మలుపు వద్ద ఆర్టీసీ బస్సుద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమీప ప్రాంతంలోనే ప్రచారం చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థిమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అనుచరులు హుటాహుటిన క్షతగాత్రుడిని ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించారు.