ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TTD Chairman : టీటీడీ చైర్మన్​గా భూమన కరుణాకర్​రెడ్డి

By

Published : Aug 5, 2023, 3:47 PM IST

Updated : Aug 5, 2023, 7:35 PM IST

TTD Chairman
TTD Chairman

15:42 August 05

TTD Chairman రెండేళ్ల పాటు చైర్మన్​గా ఉండనున్న భూమన కరుణాకర్​రెడ్డి

TTD Chairman: తిరుమల తిరుపతి దేవస్థానానికి నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. భూమన రెండేళ్ల పాటు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తితిదే నూతన చైర్మన్​గా నియమితులైన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి రెండేళ్ల పాటు ఆ హోదాలో కొనసాగనున్నారు. గతంలోనూ తితిదే ఛైర్మన్‌గా చేసిన భూమన.. తనకు మళ్లీ అవకాశం కల్పించడంపై ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి .. రెండేళ్ల పాటు ఛైర్మన్‍ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆగస్టు 8న ప్రస్తుత బోర్డు పదవీ కాలం యుగియనుండటంతో ప్రభుత్వం తితిదే నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డికి అవకాశం కల్పించింది. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తితిదే ఛైర్మన్ గా 2006 నుంచి 2008 వరకు పని చేశారు. రాజకీయాల్లో వైఎస్సార్‌కు సన్నిహితంగా ఉన్న భూమన.. 2012లో తిరుపతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 2019లో తిరుపతి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తితిదే ఛైర్మన్‍గా నియమించడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‍ రెడ్డికి భూమన ధన్యవాదాలు తెలిపారు.

Last Updated : Aug 5, 2023, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details