శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం వద్ద వంశధార నది గట్టును పటిష్ఠపరిచేందుకు రూ.7.50 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే ప్రసాదరావు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు.. భౌతికదూరం మరిచారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు ర్యాలీగా కొంత దూరం వెళ్లటం పలువురిని కలవరపరిచింది.
కరోనా వేళ.. భౌతిక దూరం ఎక్కడ?
కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా... ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించటం లేదు. నాయకులకు స్వాగతం పలకడంపై పెట్టిన శ్రద్ధ... భౌతిక దూరం పాటించటంలో కొరవడింది.
భౌతికదూరం పాటించని నేతలు