ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంబులెన్స్​లో ప్రసవం... తల్లి, బిడ్డ క్షేమం

By

Published : May 26, 2020, 11:54 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఓ గర్భిణీ 108 వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది ఎంతో చాకచక్యంతో ప్రసవం చేసి తల్లి, బిడ్డను క్షేమంగా ఆసుపత్రికి చేర్చారు.

women delivery in ambulance at srikakulam district
అంబులెన్స్​లోనే మహిళ ప్రసవం

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ గర్భణీ 108 వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నీలకంఠేశ్వర వీధికి చెందిన కుమారి శెట్టికి పురిటి నొప్పులు రావటంతో అంబులెన్స్​లో ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది ఎంతో చాకచక్యంతో ప్రసవం చేసి తల్లి, బిడ్డను క్షేమంగా ఆస్పత్రికి చేర్చారు. అంబులెన్స్ సిబ్బంది గోపాలకృష్ణ, గోవింద్​ను ఆస్పత్రి సిబ్బంది అభినందించారు.

ఇదీచదవండి:వలస కార్మికులకు పోలీసుల సహాయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details