శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ గర్భణీ 108 వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నీలకంఠేశ్వర వీధికి చెందిన కుమారి శెట్టికి పురిటి నొప్పులు రావటంతో అంబులెన్స్లో ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది ఎంతో చాకచక్యంతో ప్రసవం చేసి తల్లి, బిడ్డను క్షేమంగా ఆస్పత్రికి చేర్చారు. అంబులెన్స్ సిబ్బంది గోపాలకృష్ణ, గోవింద్ను ఆస్పత్రి సిబ్బంది అభినందించారు.
ఇదీచదవండి:వలస కార్మికులకు పోలీసుల సహాయం
TAGGED:
ichachapuram latst news