పేదరికాన్ని పారద్రోలేందుకు విద్య అవసరమని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. విద్యతో దేనినైనా సాధించవచ్చని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని.. ఏ పేద విద్యార్థి విద్యకు దూరం కాకూడదని ముఖ్యమంత్రి ఆశయమన్నారు. విద్యకు ప్రాధాన్యంను ఇచ్చారన్న తమ్మినేని.. పాఠశాలలను నాడు - నేడు కార్యక్రమం కింద ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. జగనన్న విద్యా దీవెన కింద శ్రీకాకుళం జిల్లాలో 67 వేల 5 వందల 67 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇబీసీ, ముస్లిం, క్రిస్టియన్, కాపు తదితర వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు.
విద్యకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు: తమ్మినేని
రాష్ట్రంలో విద్యకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సీఎం ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం శ్రీకాకుళం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పీకర్ తమ్మినేని సీతారాంతోపాటు మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు.
speker tammineni and minister appalaraju participate in jagananna vidya divena programme