కేంద్రం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా అనంతపురంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. నిరసన చేస్తున్న కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ మేరకు కార్మికులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కృష్ణా జిల్లా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో గుంటుపల్లి వర్క్షాప్ ఎదుట, నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మికులంతా కలిసి తొమ్మిది డిమాండ్లను యాజమాన్యం ముందుంచారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్న భాజపా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రకాశం జిల్లా చీరాలలో కార్నికులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ... కార్మిక చట్టాలను, యజమానులకు అనుకూలంగా మార్చే విధానాన్ని మానుకోవాలని హెచ్చరించారు.