Minister Sidiri Appalaraju: వైకాపా నేతల మాట వినకపోతే తెలుగుదేశం పార్టీ సర్పంచ్ల ప్రతిపాదనలు ఎంపీడీవో కార్యాలయంలోనే ఆగిపోతాయని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు అందరూ అన్ని రకాల పనుల ప్రతిపాదనలు పంపించాలని మంత్రి సూచించారు. అన్ని పంచాయతీలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చి దిద్దే బాధ్యతను.. ఎంపీపీలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Minister Sidiri Appalaraju: వైకాపా నేతల మాట వినకపోతే ఇక అంతే... మంత్రి సీదిరి వ్యాఖ్యలు
Minister Sidiri Appalaraju: మంత్రి సీదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైకాపా నేతల మాట వినకపోతే తెదేపా సర్పంచ్ల ప్రతిపాదనలు ఎంపీడీవో కార్యాలయంలోనే ఆగిపోతాయన్నారు.
Minister Sidiri Appalaraju